‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత యన్టీఆర్ పక్కన నటించడానికి సైన్ చేసిన కథానాయిక శృతి హాసన్, తాజాగా తెలుగులో మరో చిత్రాన్ని అంగీకరించింది. అల్లు అర్జున్ సరసన నటించడానికి శృతి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా శృతి హాసన్ ఎంపికైనట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో తను చేస్తున్న ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ చిత్రం పూర్తయిన వెంటనే పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు.
Posted inShruti hassan Allu Arjun movie